Once you stop learning, you start dying

6, ఏప్రిల్ 2011, బుధవారం

సత్యసాయి భక్తులూ విమర్శకులూ దొందూ దొందే

సత్యసాయిబాబా అనారోగ్యంతో ఐసీయూలో ఉన్న సమయంలో ఆయన భక్తులూ విమర్శకులూ చేసిన చేష్టలతో వీరిద్దరి స్థాయీ ఒకరికంటే ఒకరికి పెద్ద తేడాగా ఏమీ లేదని స్పష్టమైంది. భక్తులేమో ఆయన ఆరోగ్యం బాగుపడాలని నవగ్రహ హోమాలూ, సర్వదేవతా పూజలూ, యాగాలూ నిర్వహించారు. నవగ్రహాల కంటే, దేవతలకంటే ఆయన అధికుడని, దేవుడని ఇప్పటిదాకా భావించినవారే, మరి ప్రస్తుతస్తితిలో మళ్ళీ అదే గ్రహాలను, దేవతలను, ప్రార్ధించటం ఏదోగా ఉంది. అంటే ఆయన మీద ఆయన భక్తులకే విశ్వాసంలేదన్నమాట. ఇక విమర్శకుల స్తితి చూద్దాం. శరీరం దాల్చిన తర్వాత ఎంతటి మహానుభావుడైనా సరే అనారోగ్యాలు బాధలు తప్పవు. రామ,కృష్ణాది అవతారమూర్తులే అనేక బాధలు పడ్డారు. బాధలు పడినంత మాత్రాన వాళ్ళ స్థాయికి భంగం ఏమీ రాదు. ఇక సత్యసాయికి అయితే, జనం అనుకుంటున్నంత స్థాయి లేదని చాలామంది అంటారు. ఇంత చిన్న విషయం మర్చిపోయి, ఆయన దేవుడైతే ఇలా ఆస్పత్రి పాలుకావడం ఏమిటి అని విమర్శించటంఅవగాహనా రాహిత్యాన్ని చూపిస్తున్నది. మొత్తమ్మీద, భక్తులకు విశ్వాసమూ లేదువిమర్శకులకు ఆధ్యాత్మిక అవగాహనా లేదు-- ఈ ఇద్దరూ ఒకగూటి పక్షులే-- అన్న సంగతి స్పష్టం.