“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

20, సెప్టెంబర్ 2024, శుక్రవారం

తిరుపతి లడ్డులో ఎద్దుమాంసం, పందిమాంసం, చేపనూనె

గొర్రె కసాయినే నమ్ముతుంది అని ఒక సామెత !

హిందువులు నిజంగా గొర్రెలే.

క్రైస్తవులను గొర్రెలని బైబిల్ అంటుంది. బైబులు చెప్పింది తప్పు. నిజమైన గొర్రెలు హిందువులే.

గత ప్రభుత్వహయాంలో తయారైన తిరుపతి లడ్డులో ఎద్దుమాంసం, పందిమాంసం, చేపనూనె ఉన్నాయని గుజరాత్ లోని CALF (Center for Analysis and Learning in Livestock & Food) సంస్థ నిర్ధారించింది. ఇది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు అనుబంధమైన అత్యాధునికమైన పరికరాలున్న ల్యాబ్. ఇదిచ్చిన రిపోర్ట్ లో ఆధారాలతో సహా ఈ విషయం స్పష్టంగా తెలిసిపోయింది.

అంటే, గత అయిదేళ్లుగా, వెంకన్నదీక్షలు చేసి తిరుమలకు వెళ్లినవారూ, మడీ ఆచారం పాటిస్తూ, ముహూర్తాలు చూసుకుని మరీ తిరుమలలో స్వామి దర్శనానికి వెళ్లినవారూ, అనేక నియమనిష్టలు పాటిస్తూ వస్తున్న ఆచారపరాయణులూ అందరూ కలసి తిరుమల ప్రసాదమంటూ భక్తిగా కళ్ళకద్దుకుని తినినది ఎద్దుమాంసం, పందిమాంసం, చేపనూనె, ఇంకా నానాచెత్త కలిసిన ఒక స్వీట్ మాత్రమేనన్నమాట !

భలే ఉంది కదూ రుచి ! 

మన కాపీ పేస్ట్ రాజ్యాంగంలోని, ప్రభుత్వవ్యవస్థలోని భయంకరమైన లోపాలను ఈ వార్త మరొక్కసారి లేవనెత్తుతోంది.

నాయకులు నీతి తప్పితే ఏం జరుగుతుంది? ప్రమాణస్వీకారసమయంలో చేసిన ప్రమాణాలను మర్చిపోయి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ఏమౌతుంది? నోటికొచ్చిన అబద్దాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తే ఏమౌతుంది? హిందూదేశాన్ని 'సెక్యులర్' అని రాజ్యాంగంలో వ్రాసుకుని హింసాత్మక ఎడారిమతాలకు వంతపాడితే ఏమౌతుంది? మెజారిటీ హిందువులలో చైతన్యం రాకపోతే ఏమౌతుంది?

ఇదే అవుతుంది. ఇంకా కూడా అవుతుంది. చూస్తూ ఉండండి. చేతగానివాళ్ళు అంతకంటే ఇంకేం చేయగలరు మరి?

డబ్బుకోసం అడ్డదారులు తొక్కడం రాజకీయపార్టీలకు మామూలే. కానీ తిరుమల ఆలయవిషయంలో కూడా ఇటువంటి నీచమైన పనికి పాల్పడటం, ఇలా చేస్తూ పైశాచికానందాన్ని పొందటం గతప్రభుత్వం నీచత్వంలో క్రొత్త రికార్డులు సృష్టించినట్లు అయింది.

మసీదులు చర్చిలు వక్ఫ్ బోర్డులు ప్రభుత్వహయాంలో ఉండవు. ఆలయాలు మాత్రం ఎండోమెంట్ బోర్డు పరిధిలో ఉంటాయి. వాటిలో ఎడారిమతాల అధికారులు ఉద్యోగులు ఉంటారు. హిందూమతంపైన వారి ద్వేషాన్ని తీర్చుకోవడానికి అనేక అవకాశాలు వారికి ప్రతిరోజూ ఎన్నో ఉంటాయి. 

రోటీలలో ఉమ్మేసి, జ్యుసులో మూత్రం కలిపి అమ్మడం ఇస్లాం వంతు. ఆగమశాస్త్రాల ప్రకారం నడిచే పరమపవిత్రమైన తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామివారి నైవేద్యంలో ఎద్దుమాంసం, పందిమాంసం, చేపనూనె ఇంకా నానా చెత్తలు కలిపి, భగవంతుని పట్ల, కోట్లాది హిందువుల పట్ల ఘోరమైన పాపాన్ని చేయడం క్రైస్తవమతానికి చెందిన గత ప్రభుత్వపు వంతు.

క్రైస్తవం, ఇస్లాం మతాలు ఈ దేశాన్ని సర్వనాశనం దిశగా తీసుకుపోతున్నాయి.

హిందువులేమో 'అన్ని మతాలూ ఒకటే', 'మనమందరం భాయీ భాయీ' అని చెక్కపాటలు పాడుకుంటూ ఎగురుతూ ఉంటారు. ఇతర మతాలు వారి ప్రభుత్వాలు మాత్రం ఇలాంటి నీతిలేని పనులు చేస్తూ, మన ఆచారాలకు తూట్లు పొడుస్తూ, తిన్న ఇంటికే నిప్పు పెడుతూ పైశాచికానందాన్ని పొందుతూ గుడారాల పండగలు చేసుకుంటూ ఉంటారు.

మనమేమో అలాంటివారికే ఓట్లు వేసి గెలిపించుకుంటాం !

గొర్రె కసాయి సామెత ఇదేగా మరి !

ఇలాంటి పాపపుతిండి తిన్నందుకు హిందూధర్మశాస్త్రాల ప్రకారం హిందువులు ఏం చేయాలో తెలుసా? నాలుకలు కాల్చుకోవాలి. ఏడాది పాటు ఉపవాసాలుంటూ, చన్నీళ్ళ స్నానం, నేలపడకలు ఆచరిస్తూ, మంత్రజపం ద్వారా తమను తాము శుద్ధిచేసుకోవాలి. మీరాపని చేస్తుంటే వారు కూడికలు తీసివేతలు చేసుకుంటూ నవ్వుతూ ఉంటారు. కానివ్వండి మరి ! 

కనీసం ప్రాయశ్చిత్తం చేసుకునే ధైర్యమూ తెగువా కూడా హిందువులలో లేవు. వీరిలో చైతన్యం ఎప్పటికి వస్తుందో ఆ దేవుడికే తెలియాలి !

దేశం నాశనం దిక్కుగా ప్రయాణిస్తోందిరా బాబూ, కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరవండి. ప్రతిఘటించడం ప్రశ్నించడం నేర్చుకోండి. దద్దమ్మల్లాగా కూచుంటే సమీప భవిష్యత్తులో మీ ధర్మమూ ఉండదు, మీరూ ఉండరు.

ఇప్పుడు మిమ్మల్ని కాపాడటానికి ఛత్రపతి శివాజీ లేడు, సుభాష్ చంద్ర బోస్ లేడు. నిరంతర జాగరూకతతో మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి.

ఇప్పుడు మీకు బోధించడానికి సమర్ధరామదాసు, విద్యారణ్యస్వామి, వివేకానందస్వామి లేరు, రాజకీయతొత్తులై, ధర్మద్రోహులై, అవినీతికి వంతపాడే విలువలులేని నకిలీ స్వాములున్నారు. మీకు మీరే బోధించుకోవాలి.

ఉమ్మి, ఉచ్చ, పందిమాంసం ఎద్దుమాంసం తింటున్నపుడైనా హిందూగొర్రెలకు బుద్ధి రాకపోతే ఎలా?