Once you stop learning, you start dying

23, ఏప్రిల్ 2025, బుధవారం

మా 69 వ పుస్తకం Indian Astro Numerology విడుదల

ఇంతకు ముందు నాచే తెలుగులో వ్రాయబడిన 'భారతీయ జ్యోతిష సంఖ్యాశాస్త్రము' అనే పరిశోధనా గ్రంధం, ఇప్పుడు ఇంగ్లీషులోకి తర్జుమా చేయబడి, Indian Astro Numerology అనే E-Book గా నేడు విడుదల అవుతున్నది. 

ఇది నా కలం నుండి వెలువడుతున్న 69 వ గ్రంధం. ఇక్కడ లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా విడుదల అవుతుంది.

పాశ్చాత్య సంఖ్యాశాస్త్రానికి భిన్నమైన మన భారతీయ సంఖ్యాశాస్త్రాన్ని నా పరిశోధనలో కనిపెట్టి  52 జాతకచక్రాల సహాయంతో సోదాహరణంగా ఈ గ్రంధంలో వివరించాను.

ఈ గ్రంధం తెలుగులో చాలా ప్రజాదరణను పొందింది. హైద్రాబాద్, విజయవాడ పుస్తకప్రదర్శనలలో ఎక్కువగా పాఠకులు తీసుకున్న గ్రంధాలలో ఇదీ ఒకటిగా నిలిచింది. ఈ పద్ధతి చాలా బాగుందని, జాతకాల విశ్లేషణలో బాగా ఉపయోగపడుతున్నదని చదువరుల నుండి నాకు మంచి రివ్యూలు కూడా వచ్చాయి.  

అంతర్జాతీయ పాఠకుల ఉపయోగార్ధమై ప్రస్తుతం దీనిని ఇంగ్లీషులోకి అనువదించి విడుదల చేస్తున్నాము.

తెలుగు పుస్తకమును ఇంగ్లీషులోకి అనువాదం చేసిన నా శిష్యురాలు స్నేహలతారెడ్డికి ఆశీస్సులు తెలుపుతున్నాను.

ఇంగ్లీషు చదివేవారిలో దీనికి విస్తృత పబ్లిసిటీని కల్పించాలని Panchawati USA టీమ్ వారిని కోరుతున్నాను.

read more " మా 69 వ పుస్తకం Indian Astro Numerology విడుదల "

చైనా ఇజ్రాయెల్ లను చూచి బుద్ధితెచ్చుకోండి

35 ఏళ్ల క్రితం, హైద్రాబాద్ వాసి సందీప్ కుమార్ భట్టాచార్య, కాశ్మీర్ యాత్రకని కుటుంబంతో సహా వెళ్లి, శ్రీనగర్ గడియారస్థంభం సెంటర్లో బాంబుపేలుడులో చనిపోయాడు. అతను నా స్నేహితుడు. 

నిన్న 27  మంది అమాయక టూరిస్టులు పహల్గావ్ లో హత్యకు గురయ్యారు. మతం అడిగి మరీ ఈ హత్యలు చేశారు. 35 ఏళ్ళు గడచినా, కాశ్మీర్ పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు

మొన్న శ్రీనగర్, నిన్న ముజఫర్ నగర్, నేడు పహల్ గావ్, రేపు ఇంకెక్కడో. దారుణాలు కిరాతకాలు మళ్ళీమళ్ళీ జరుగుతూనే ఉంటాయి. మనం మాత్రం క్షమించేస్తూ ఉంటాము. కళ్ళు మూసుకుని అన్నీ మర్చిపోయి హాయిగా బ్రతికేస్తూ ఉంటాము.

మన మధ్యనే ఉన్న రాక్షసులు మనకు నీతులు చెబుతూనే ఉంటారు. మతాలన్నీ ఒకటేనంటారు. శాంతిసూత్రాలు వల్లిస్తారు.  సరిహద్దు అవతల ఉన్న వారి సోదరులు కూడా, అదే గ్రంథం ప్రాతిపదికగా హత్యలు చేస్తూ ఉంటారు. అడిగితే, మేమేం చెయ్యలేదంటారు. మిమ్మల్ని మీరే చంపుకుని అమాయకులమైన మామీద తోస్తున్నారంటారు.

మనమేమో డబ్బుకు అమ్ముడుపోతూనే ఉంటాము. వాళ్ళచేతే తన్నించుకుంటూ ఉంటాము. దేశాన్ని తాకట్టుపెడుతూ ఉంటాము. అదే మనకు ఆనందం !

సమస్య టెర్రరిజంలో లేదు. మనలో ఉంది. వాళ్ళ పనిని వాళ్లు తెలివిగా చేస్తూనే ఉన్నారు. మనమే చేతులు కట్టుకుని కూర్చున్నాం.

పరిష్కరించనంత వరకూ సమస్య ఉంటూనే ఉంటుంది. జండుబామ్ తో కేన్సర్ తగ్గదు. మంచిమాటలు రాక్షసులకు వినిపించవు. 

దెబ్బకు దెబ్బచాలదు. ఒక దెబ్బకు పది దెబ్బలు పడాలి. చైనా ఇజ్రాయెల్ లను చూచి మన దేశం నేర్చుకోవాలి. లేదంటే ముందుముందు సర్వనాశనమే.

read more " చైనా ఇజ్రాయెల్ లను చూచి బుద్ధితెచ్చుకోండి "

17, ఏప్రిల్ 2025, గురువారం

చేతకానివాళ్ళు

గొర్రెలు కసాయినే నమ్ముతాయి

కొన్ని రాష్ట్రాలు ఇంకా కాంగ్రెస్ నే నమ్ముతున్నాయి

ఆ పార్టీ పుణ్యమాని దేశం మూడు ముక్కలైంది.

ఎన్నో సంక్షోభాలలో చిక్కుముళ్లలో ఇరుక్కుపోయింది


ముందుముందు ఇంకెన్ని ముక్కలు కానుందో?

ఇంకెన్ని గడ్డుపరిస్థితులను ఎదుర్కోబోతోందో?


మొన్న కాశ్మీర్ లో పండితులు నిన్న మణిపూర్లో మైతీలు 

నేడు బెంగాల్లో హిందువులు తమదేశంలోనే తాము శరణార్థులై

ఇళ్ళూ వాకిళ్ళూ వదిలి పారిపోయి

శిబిరాలలో దాక్కొని ఉంటున్నారు.


రోడ్లమీద కొట్టుకునే రోజొస్తుందని 

సివిల్ వార్ కి దారితీస్తుందని

పదేళ్లనుంచి చెబుతున్నాను

నిజమౌతోంది చూడండి


కాశ్మీర్, పంజాబ్, బెంగాల్, తెలంగాణా, కర్ణాటక, కేరళ

ఇలా ఒక్కొక్క రాష్ట్రానికీ మతోన్మాద వైరస్ సోకుతోంది

మతనిష్పత్తి రూపంలో ప్రమాదం

చాపక్రింద నీరులా ముంచుకొస్తోంది

దీనికొకటే పరిష్కారముంది


గాంధీ నెహ్రూలు కాంగ్రెస్ నాయకులు

ఇన్నేళ్లు కష్టపడి ఇంత నాశనం చేశాక

ఇక మనమేం బాగుచెయ్యగలం?

మనమే కాదు ఎవరూ ఏమీ చెయ్యలేరు


ఈ యుద్ధాన్ని గెలవడం అసాధ్యం

అందుకే ఒక పనిచేద్దాం


అన్ని రాష్ట్రాలూ కాంగ్రెస్ కే ఓటెయ్యాలి

మిగతా పార్టీలను రద్దు చేయాలి

బార్డర్స్ బార్లా తెరవాలి

ఎవరొచ్చినా నోర్మూసుకోవాలి


తంతే తన్నించుకోవాలి

చంపితే చంపించుకోవాలి

ఇళ్లనూ వాకిళ్ళనూ ఆడాళ్ళనూ భూమినీ లాక్కుంటే

వదిలేసి పారిపోయి గుడారాలలో దాక్కోవాలి

శాంతియుతంగా అన్నీ అప్పజెప్పాలి


లేదా,


అందరూ ఇస్లాంలోకి మారిపోవాలి

రాజ్యాంగం పోయి షరియా రావాలి

ఇండియా ఇస్లామిక్ దేశం కావాలి

మిగతావాళ్లకు ఓటుహక్కు తీసేయాలి


కనీసం సివిల్ వార్ తప్పుతుంది

కుట్రలూ కుతంత్రాలూ అరాచకాలూ

హింసా చావులూ అల్లకల్లోలాలూ తప్పుతాయి

కనీసం అదైనా చేద్దాం

చేతకానివాళ్ళు ఇంకేం చెయ్యగలరు మరి?

read more " చేతకానివాళ్ళు "

13, ఏప్రిల్ 2025, ఆదివారం

అశాంతి నిలయం

'ఆ మధ్యన అమెరికా నుండి కొంతమంది స్నేహితులొస్తే అశాంతినిలయం వెళ్ళొచ్చాము' అన్నదొక శిష్యురాలు. 

'అమెరికా - అశాంతినిలయం, ప్రాస బాగుందిగాని, విషయం చెప్పు' అన్నాను.

'పటాటోపం తప్ప అక్కడేమీ లేదు' అందామె.

'ఇరవై ఏళ్ళనుంచీ నేనుకూడా ఇదే చెబుతున్నాను' అన్నాను ప్రాస కలుపుతూ.

'వాలంటీర్లకూ భక్తులకూ మా ఎదురుగానే గొడవైంది' అన్నదామె. 

'వాలంటీర్లకు వాలం ఉందా?' అడిగాను.

'అర్ధం కాలేదు' అంది 

'పోనీ భక్తులకు రెక్కలున్నాయా?' అడిగాను.

'మళ్ళీ అర్ధం కాలేదు' అంది 

'వాలం అంటే తోక, తోక ఉన్నవారే వాలంటీర్లు. అంటే కోతులు. బకము అంటే కొంగ. నేటి భక్తులందరూ బకులే. అంటే  కొంగజపం చేసే అవకాశవాదులన్నమాట. గట్టిగా అదిలించామంటే తుర్రున ఎగిరిపోతారు. మరి కోతులూ కొంగలూ ఒకచోట చేరితే అశాంతినిలయం కాక ఇంకేమౌతుంది? అడిగాను.

'మరి స్వామి ఏం చేస్తున్నట్టు?' అనుమానమొచ్చింది శిష్యురాలికి.

'ఉన్నప్పుడేం చేశాడు ఇప్పుడు చెయ్యడానికి?' అడిగాను.

'మళ్ళీ అర్ధం కాలేదు' అంది

'విచారణ జరుగుతోంది. బోనులో నిలబడి ఉన్నాడు' అన్నాను.

'ఏంటో మీ మాటలేవీ అర్ధం కావు' అందామె.

'కొన్ని అర్ధం కాకపోవడమే మంచిది' అన్నాను.

read more " అశాంతి నిలయం "

11, ఏప్రిల్ 2025, శుక్రవారం

చెప్పేది చెయ్యకు

మెదడుకు శస్త్రచికిత్స చేయించుకున్న గురువుగారు

ఆరోగ్యసూత్రాలు చెబుతున్నారు

అణువులు గంతులేస్తున్నారు


యోగాను భక్తులకు బోధించే ఇంకో గురువుగారు

తనేమో జిమ్ము చేస్తున్నారు

పరమాణువులు పల్టీలు కొడుతున్నారు


చెప్పేది చెయ్యమని శాస్త్రంచెబుతోంది

చెప్పేది చెయ్యక్కర్లేదని  వీరంటున్నారు

కలియుగంలో ఇలాగే ఉంటుందని నేనంటున్నాను

అణువులూ పరమాణువులూ వర్ధిల్లండి !

read more " చెప్పేది చెయ్యకు "

రాత్రి భజనలు

దుకాణం దగ్గర గుడి పూజారి కలిశాడు.

'ఊర్లోకొచ్చారు కదా ! మా ఇంటికెళదాం రండి. కాఫీ త్రాగుతూ మాట్లాడుకుందాం' అన్నాడు మర్యాదగా.

'లేదండి. నేను త్రాగను, ఇంకోసారి వస్తాలెండి మీ ఇంటికి' అన్నాను.

'గుడికి రండి. రాత్రి పదకొండుదాకా భజన చేస్తారు' అన్నాడాయన.

'అవన్నీ చిన్నప్పుడే అయిపోయాయి. క్రొత్తగా ఇప్పుడెందుకు?' అన్నాను

ఆశ్చర్యంగా చూశాడాయన.

'అయినా, అంత రాత్రిపూట భజనలు చేయకూడదు. రాత్రిళ్ళు పూజలు చేసేది రాక్షసులు. పైగా శబ్దకాలుష్యం. ఆ టైంకి మేమొక నిద్రతీసి లేస్తాం' అన్నాను.

మళ్ళీ ఆశ్చర్యంగా చూశాడాయన.

'ఏదైనా వేళకి చెయ్యాలి. అలా చేయకపోవడమే రోగాలకు ఒక కారణం' అన్నాను.

ఆయనలా చూస్తున్నాడు.

'ధర్మాన్ని మనం అనుసరించాలి. మనం చేసే ప్రతిదీ ధర్మం అనుకోకూడదు' అన్నాను

ఇంకా అలాగే చూస్తున్నాడాయన.

నేనొచ్చేశాను.

read more " రాత్రి భజనలు "

మేం చేస్తున్నదేంటి?

నిన్నొక పనిమీద ఊర్లోకెళ్ళాను.

మాటల మధ్యలో, 'ఫలానా మాతాజీకి 102 ఏళ్ళుట. నిన్న చనిపోయింది' అన్నారొకరు.

'మర్రిచెట్టు కూడా బ్రతుకుతుంది. ఉపయోగం?' అన్నాను

'సాధువుగా మంచిగా బ్రతికింది కదా అన్నేళ్లు?' అన్నదామె.

'మాయసాధువుగానా? వాళ్ళు చెప్పేదంతా ధర్మవిరుద్ధం. బూటకం.' అన్నాను.

'మరి మంచిగా ఉంటూ అన్నేళ్లు ఆరోగ్యంగా బ్రతకాలంటే ఏం చెయ్యాలి?' అన్నదామె.

'మేము చేస్తున్నదేంటి?' అన్నాను. 

read more " మేం చేస్తున్నదేంటి? "

25, మార్చి 2025, మంగళవారం

6 వ సాధనా సమ్మేళనం విశేషాలు






















ప్రపంచం 
చీకటిని వెలుగుగా భ్రమిస్తూ
ముందుకు పోతోంది.
మా ఆశ్రమంలో
వెలుగుదారులు విరబూస్తున్నాయి.

సాధనాసమ్మేళనంలో జరిగిన సమావేశాలలో ముఖ్యంగా కొన్నింటిని ఇక్కడ పరిచయం చేస్తున్నాను.

జ్యోతిషసమ్మేళనం

వారం రోజులలో జరుగబోతున్న శనీశ్వరుని రాశిమార్పు యొక్క ఫలితాలను శిష్యులకు వివరించాను. అదేసమయంలో అమావాస్య జరుగుతున్నది. జనజీవనంలో ఇది చాలా మార్పులను తెస్తుంది. చాలామందికి కోలుకోలేని దెబ్బలు తగులబోతున్నాయి. శిష్యులలో ఎవరెవరికి ఏయే ఫలితాలు జరుగుతాయో సూచించి, వాటికి తీసుకోవలసిన యోగపరమైన రెమెడీలను వివరించాను.

లోకంలో మీరు చూచే చీప్ రెమెడీలు నా వద్ద ఉండవు. మావి యోగపరమైన రెమెడీలు. ఇవి ప్రభావవంతమైన శాశ్వతఫలితాలనిస్తాయి. డబ్బుకు అమ్మబడేవి కావు. ఇంతకు ముందైతే ఈ శనీశ్వరుని రాశిమార్పు పైన ఒక పెద్ద పోస్ట్ వ్రాసి ఉండేవాడిని. ఇప్పుడు తెలివి తెచ్చుకున్నాను గనుక అటువంటి పనులు చేయడం లేదు. వజ్రాలను రోడ్డుపైన వెదజల్లడం ఎందుకు? అర్హులైనవారికి మాత్రమే వాటిని అందించాలి. అందుకే బ్లాగు బురదలోకంలో వాటిని వ్రాయడం తగ్గించాను. ఎవరికి అర్హత ఉందో వారికి మాత్రమే వాటిని ప్రస్తుతం అందిస్తున్నాను.

'భగవద్గీతా కందమరందము' విడుదల

శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయిగారు, న.ర.సం (నవ్యాంధ్ర రచయిత్రుల సంఘానికి) ఉపాధ్యక్షురాలు. ఈమె నా శిష్యురాలు. మంచి కవయిత్రి. వేంకటేశ్వరస్వామివారికి వీరభక్తురాలు. తెలుగు మరియు సంస్కృత భాషలలో MA చేసిన ఈమె, పద్యాలను అలవోకగా ఆశువుగా చెప్పడంలో సిద్ధహస్తురాలు. వీరి కుటుంబంలోనే కవిత్వధోరణి ఉంది.

ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడిన భగవద్గీత మీకందరికీ సుపరిచితమే. దానిలో ఆయన 108 శ్లోకాలను పాడారు. వాటన్నిటినీ 150 కందపద్యాలలో జ్యోతిర్మయిగారు తెలుగులో చక్కగా వ్రాశారు. ఆ పుస్తకానికి 'భగవద్గీతా కందమరందము' అని పేరుపెట్టి, ఎంతో గురుభక్తితో నాకు అంకితమిచ్చారు. ఆ కార్యక్రమం ఈ సాధనాసమ్మేళనంలో జరిగింది. త్వరలో ఈ గ్రంధాన్ని మా పంచవటి పబ్లికేషన్స్ నుండి పుస్తకంగా ప్రచురిస్తున్నాము.

గతస్మృతులు

శ్రీ రధం మదనాచార్య, ప్రముఖ పంచాంగకర్త మరియు తెలుగు యూనివర్సిటీ జ్యోతిషవిభాగ ఆచార్యులు మా సభ్యులే. స్వతంత్రంగా గణితం చేసి పంచాంగాన్ని వ్రాయగల సిద్ధహస్తులలో ఈయనొకరు. 

నేను 2000 సంవత్సరం మొదటి బ్యాచ్ లో MA  జ్యోతిషం చేశాను. ఈయన మూడవ బ్యాచ్ లో  చేశారు. ఆ తరువాత వేదాంగజ్యోతిషంలో పీహెచ్ డీ కూడా చేసి డాక్టరేట్ పొందారు. ఇద్దరం శ్రీ గోరస వీరభద్రాచారి గారి శిష్యులమే. MA చేసిన సమయంలో నన్ను ఇంటర్వ్యూ చేసినది శ్రీ గోరస గారే. వారంటే నాకు చాలా అభిమానం మరియు గౌరవం. వారి ప్రియశిష్యులే రథంగారు కావడం. మళ్ళీ మేమిలా కలుసుకోవడం చాలా సంతోషాన్ని కలిగించింది.

మదనాచార్యగారికి 80 ఏళ్ల పెద్దవయసైనా కూడా అమిత వినయశీలి. జ్ఞానపిపాసి. నా రచనలను ఎంతో అభిమానిస్తారు. నా పుస్తకం, 'మహనీయుల జాతకాలు - జీవిత విశేషాలు' ను ఎంతో మెచ్చుకున్న జ్యోతిషవేత్తల్లో ఈయనొకరు. తనవద్ద జ్యోతిషశాస్త్రాన్ని నేర్చుకునే ప్రతివారికీ ఈ పుస్తకాన్ని, నా రచనలను తప్పకుండా చదవమని ఈయన సూచిస్తూ ఉంటారు. 'మీరు పరిచయం కావడం నా అదృష్టం' అని ఈ నిగర్వి తరచూ అంటూ ఉంటారు. స్వయంగా జ్యోతిషశాస్త్ర డాక్టరేట్ అయి, యూనివర్సిటీలో ఆచార్యులై ఉండి కూడా, గర్వం లేకుండా, నా వద్ద జ్యోతిషశాస్త్రపు లోతులను నేర్చుకోవాలని ప్రయత్నించే మనసున్న మనీషులలో ఈయనొకరు. శ్రీ రధం మదనాచార్యగారు ప్రచురించిన ప్రస్తుత సంవత్సరపు పంచాంగమును ఇక్క చూడండి.

రిట్రీట్లో కొంచెం తీరిక దొరికినపుడు గత స్మృతులను కలబోసుకున్నాం.  గోరస గారితో తన అనుభవాలను ఆయన చెప్పుకొచ్చారు. గోరసగారికి అంజనసిద్ధి ఉండేది. ఒకసారి ఆయనతో హంపీకి వెళ్లిన సమయంలో, అక్కడ విరూపాక్ష ఆలయం దగ్గరలో ఒక ప్రదేశంలో, 'ఇది కృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలతో కవిత్వసభ నడిపిన ప్రాంతం. ఎవరైనా చూస్తామంటే ముందుకు రండి' అని ఆయనన్నారట.  ఎవరూ ధైర్యం చేయలేదు. కానీ ఒక అబ్బాయి ముందుకొచ్చాడు. మంత్రించిన విభూతిని ఆ అబ్బాయి కళ్ళను తాకించారు గోరసవారు. వెంటనే కృష్ణదేవరాయల భువనవిజయం దృశ్యం ఆ అబ్బాయి కళ్ల ముందు కనిపించడం మొదలుపెట్టింది. కాసేపు చూచాక, ఆ విభూతిని తుడిచేశారు. వెంటనే ఆ దృశ్యం ఆగిపోయింది. 'ఈ సంఘటనకు ప్రత్యక్షసాక్షిని నేనే' అని రధంగారు నాతో అన్నారు.

అసలైన యోగశాస్త్రం

నేటి నకిలీసమాజంలో ప్రతివాడూ ఒక గురువే. యోగశాస్త్రం 'యోగా' అని కూచుంది. పార్కులలో, క్లబ్బులలో, జిమ్ములలో చేయబడే అధమస్థాయికి చేరుకుంది. అసలైన యోగశాస్త్రం అది కాదు. అసలైన సర్వసమగ్ర సాధనామార్గం మావద్ద మాత్రమే ఉందని ఎన్నోసార్లు గతంలో చెప్పాను. దీనిని అహంకారంగా చాలామంది భావించారు. అహంకారం కాదు, సత్యమని మళ్ళీమళ్ళీ చెబుతున్నాను. వాస్తవాలు అలాగే కనిపిస్తాయి. రుచిచూస్తేనే దేని రుచైనా తెలుస్తుంది. దూరంనుండి ఎలా తెలుస్తుంది? అయితే,  ఒకరికి అర్ధం కానంతమాత్రాన మాకొచ్చిన నష్టమేమీ లేదు. బలవంతాన ఒకరికి నేర్పవలసిన ఖర్మా మాకు లేదు.

సభ్యులలో కొందరు ఆల్ఫాస్టేట్ ఎలా ఉంటుందో రుచి చూస్తామన్నారు. మా సాధనామార్గంలో, ఆల్ఫాస్టేట్ (యోగనిద్ర) చాలా మొదటిస్థాయిలోనే వస్తుంది.  కొద్దిపాటి అభ్యాసంతో వారిని దానిలోకి పంపించాను. ఆ స్థితిలో శిష్యులున్న ఫోటోలను ఇక్కడ చూడండి.

రాబోయే రిట్రీట్ వరకూ అభ్యాసం చేయవలసిన యోగవిధానాలను శిష్యులకు నేర్పించాను.

సందేహాలు - సమాధానాలు

పనికిరాని ఊకదంపుడు ఉపన్యాసాలంటే నాకు చిరాకు. మనం ఏది మాట్లాడినా ప్రాక్టికల్ గా ఉపయోగపడాలి. మనిషిని జీవితంలో ముందుకు నడిపించే విధంగా ఉండాలి. అందుకే నా శిష్యుల సాధనాజీవితంలో ఎదురౌతున్న సమస్యలకు, సందేహాలకు జవాబులు చెప్పడం, వాటిని పరిష్కరించడం పైనే నేనెక్కువ శ్రద్ధ పెడతాను. అందుకే దీనికి ఎక్కువ సమయాన్ని కేటాయించాము.

కర్మయోగం

ఆశ్రమం తోటలో పనిచేయడం శిష్యులకు సరదా. అదే పనిని కర్మయోగంగా చేయమని నేను చెబుతాను. ఈ మూడు రోజులూ అందరూ కలసి వారికిష్టమైన తోటపనిని ఆడుతూ  పాడుతూ ఆనందంగా చేశారు.

జ్యోతిష్యశాస్త్ర చర్చలు, ధ్యానాభ్యాసం, యోగశిక్షణ, కర్మయోగం, గ్రంథావిష్కారం, శిష్యుల భావావిష్కరణ, సందేహాలు సమాధానాలు, అభిప్రాయాల కలబోత, కులమతాలకు అతీతంగా మానవత్వ భావనతో అందరూ కలసిమెలసి జీవించడం, చివరలో బరువెక్కిన హృదయాలతో వీడ్కోలు తీసుకోవడం,  జూలైలో జరుగబోయే గురుపూర్ణిమ సాధనా సమ్మేళనానికి సిద్ధం కావడం - వీటితో 6 వ సాధనా సమ్మేళనం విజయవంతంగా ముగిసింది.
read more " 6 వ సాధనా సమ్మేళనం విశేషాలు "

21, మార్చి 2025, శుక్రవారం

మా ఆశ్రమంలో 6 వ సాధనా సమ్మేళనం మొదలు



నేడు మార్చి 21ఈక్వినాక్టియల్ డే 

మన భాషలో చెప్పుకుంటే, వసంత విషువత్ దినం. ఈరోజున సూర్యుడు  సరిగ్గా భూమధ్యరేఖపైన ఉంటాడు. కనుక,  భూమిపైన పగలూ రాత్రీ సమానంగా ఉంటాయి. చూడగలిగేవాళ్లకు ప్రకృతిలో అంతటా నేడు సమత్వం కనిపిస్తుంది. అందుకే నేటినుండి మూడు రోజులపాటు పంచవటి ఆశ్రమంలో సాధనాసమ్మేళనం మొదలైంది.

మా విధానం ప్రత్యేకత ఏమిటి?

కులాల కుళ్ళుకూ, మతాల మత్తుకూ, పూజల పుచ్చులకూ, ఆచారాల మెచ్చులకూ, ఫకీర్ల గుళ్ళకూ, రాక్షసదీక్షల బళ్లకూ, మైకుల గోలకూ, టీవీల జోలకూ, పాండిత్య ప్రదర్శనలకూ, వ్యాపార విమర్శనలకూ, మెట్ట వేదాంతాలకూ, పొట్ట వైరాగ్యాలకూ, ఈజీచెయిర్ తీర్పులకూ, లేజీలైఫ్ కూర్పులకూ, వీటన్నింటికీ భిన్నమైన, అసలైన, సర్వసమగ్ర సనాతన సాధనామార్గాన్ని, కులంతో, ధనంతో, ఆస్థిఅంతస్థులతో సంబంధం లేకుండా, అందరికీ సమానంగా బోధించే మహత్కార్యంలో భాగంగా ఈ సాధనాసమ్మేళనం జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్ లోని ఒక మారుమూలగ్రామంలో ఈ ఆధ్యాత్మికవిప్లవం నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటోంది. అనుసరించేవారు, ఆచరించేవారు, పాలుపంచుకుంటున్నవారు అదృష్టవంతులు.

విపక్షుల గురించి చెప్పడానికేముంది? అవి పక్షులే.

read more " మా ఆశ్రమంలో 6 వ సాధనా సమ్మేళనం మొదలు "

21, ఫిబ్రవరి 2025, శుక్రవారం

శ్రీ సూక్తులు

'కుంభమేళా కెళ్ళొచ్చా' అన్నాడొకడు

'కుంభం లాంటి ఆ పొట్ట తగ్గించు ముందు' అన్నాను.


'కుండలినీ యోగం నేర్చుకుంటున్నా' అన్నాడొకడు

'బండలాంటి నీ గుండెను ముందు మెత్తగా మార్చు' అన్నాను.


'సుషుమ్నా క్రియను అభ్యాసం చేస్తున్నా' అన్నాడింకొకడు

'కర్మ ఎలా చేయాలో ముందు నేర్చుకో. క్రియలు అవే జరుగుతాయి' అన్నాను.


'నా కుండలిని నిద్ర లేచింది ' అన్నాడొకడు

' నాదస్వరం సరిగా ఊదు. లేకపోతే కాటేస్తుంది ' అన్నాను


'బాబాజీ క్రియాయోగంలో దీక్ష తీసుకున్నా' అన్నాడు మరోవాడు. 

'ఆయనెప్పుడో పోయాడు. ఇంకెన్నాళ్లు బ్రతికిస్తారు?' అడిగాను


'మాది అద్వైతమార్గం' అంది ఒకామె.

'ఆ చెప్పడంలోనే తెలుస్తోంది మీ అద్వైతం' అన్నాను.


'నేను శ్రీవిద్యోపాసకురాలిని' అని ఇంకొకామె.

'పాసనాలు తగ్గడానికి ముందు మందేసుకో' అన్నాను


'మాది పెద్దలమార్గం' అన్నాడింకొకడు.

'వాళ్ళు తాగినవి నేతులా? డాల్డానా?' అడిగాను


' ఏ సాధనా అక్కర్లేదు' అంది ఇంకొకామె

'ఏమీ సాధించలేని జీవితం అంతే అంటుంది' అన్నాను


'సూక్ష్మలోకాలు చూశా' అన్నాడు ఇంకో మానవుడు

'ఈ లోకాన్ని సరిగ్గా చూడు ముందు' అన్నాను


'ఆత్మలతో మాట్లాడతా' అంది ఇంకో జీవి. 

'ముందు నీ పెళ్ళాంతో రోజూ కాసేపు మాట్లాడు' అన్నాను


'మాతాజీ నైపోయా' అంది ఎర్రచీర కట్టుకున్న ఒక పతివ్రత

'బాగా ముదిరింది, తగ్గడం కష్టం' అన్నాను

read more " శ్రీ సూక్తులు "

కాగితపు పడవలు

అంతర్జాలపు విషంతో

మెదళ్ళు నిండిపోతున్నాయి 

మనుషుల సమాజంలో

జంతువులు పెరిగిపోతున్నాయి


అహంకారాల బురదలతో

హృదయాలు కుళ్ళిపోతున్నాయి

అతితెలివి బ్రతుకులతో

వయసులు మళ్లిపోతున్నాయి


డబ్బు వెంట పరుగులలో

జీవితాలు చెల్లిపోతున్నాయి

బాంధవ్యాలు ఆవిరైపోతూ

జ్ఞాపకాలను చల్లిపోతున్నాయి


ఆధ్యాత్మికపు ముసుగులలో

ఆవేశాలు చల్లారుతున్నాయి

అజ్ఞానపు ఆకర్షణలతో

అవరోధాలు ఊరేగుతున్నాయి


మురికిగుంటల దారులలో

నీటిచెలమలెందుకుంటాయి?

బండరాళ్ళ కనుమలలో

నదుల జాడలెందుకుంటాయి?


వరద ముంచుకొస్తుంటే

కాగితపు పడవలెలా ఆదుకుంటాయి?

ఊర్లు తగలబడుతుంటే

ఉత్తమాటలెలా అక్కరకొస్తాయి?

read more " కాగితపు పడవలు "

17, ఫిబ్రవరి 2025, సోమవారం

చేపల పాపం

నీళ్లలో మునిగితే పాపాలు పోతాయని

చేపలంటున్నాయి

ఎడారిలో ఎగిరితే పాపాలు పోతాయని

కొంగలంటున్నాయి


చేపలను కొంగలు తింటున్నాయి

కొంగలు వలల్లో పడుతున్నాయి

వలలు ఎండకు చివికిపోతున్నాయి


చేపలూ కొంగలూ వలలూ పోయాక

పాపం !

పాపం అడుగుతోంది

'నేనెలా పోతాను?' అని

read more " చేపల పాపం "

2, జనవరి 2025, గురువారం

విజయవాడ బుక్ ఫెస్టివల్ - 2025 లో పంచవటి స్టాల్ మొదలైంది




నేటి నుండి 12 వ తేదీ వరకూ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం గ్రౌండ్స్ లో జరిగే బుక్ ఫెస్టివల్ లో 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' కు స్టాల్ నంబరు  219  కేటాయించబడింది.

నేడు విజయవాడ పంచవటి బృందంతో మా స్టాల్ ప్రారంభించబడింది. ఆ ఫోటోను ఇక్కడ చూడవచ్చు.

1992-1995 మధ్యలో నేను విజయవాడలో ఉన్నసమయం లోనూ, ఆ తరువాత కూడా గుంటూరులో ఉన్నంతవరకూ వీలైనప్పుడల్లా ప్రతి ఏడాదీ తప్పకుండా ఈ పుస్తకమహోత్సవాన్ని సందర్శించేవాడిని. అప్పట్లో PWD గ్రౌండ్స్ లో ఎంతో శోభాయమానంగా ఈ బుక్ ఫెస్టివల్ జరిగేది. విజయవాడ మొత్తానికీ ఆ పదిరోజులు పండుగలుగా ఉండేది. పుస్తకాభిమానులందరూ అక్కడ చేరేవారు. కానీ, గతప్రభుత్వం ఆ గ్రౌండ్ ను మార్చేసిన తర్వాత, ఆ వైభవం తగ్గిపోయింది. ఇప్పుడు బుక్ ఫెస్టివల్ ఎక్కడ పెట్టాలో తెలీక, గ్రౌండ్ కోసం వెతుక్కునే పరిస్థితి పట్టింది.

అయినా సరే, పుస్తక మహోత్సవాన్ని ఎక్కడో ఒక గ్రౌండ్ లో పెడుతున్నారు. పుస్తకాభిమానులు వెతుక్కుంటూ వెళ్లి సందర్శిస్తున్నారు. నెట్ ప్రభావంతో పుస్తకాలను చదవడం తగ్గినప్పటికీ, మొబైల్ దెబ్బకు తట్టుకుని పుస్తకం ఇంకా బ్రతికే ఉందని నిరూపిస్తున్నారు.

ఈ పదిరోజులలో ఏదో ఒకరోజున నేను కూడా విజయవాడ బుక్ ఫెస్టివల్ ను సందర్శిద్దామని అనుకుంటున్నాను.

ఈ స్టాల్లో మా పుస్తకాలన్నీ లభిస్తాయి. నా రచనలను అభిమానించే విజయవాడ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అక్కడ మా ఫౌండేషన్ సెక్రటరీ శ్రీ రామమూర్తిగారిని, ఇతర సభ్యులను కలుసుకోవచ్చు. మా సాధనామార్గం మీద గాని, జనరల్ గా ఆధ్యాత్మికమార్గం పైనగాని మీకున్న సందేహాలను తీర్చుకోవచ్చు.

బుక్ ఫెస్టివల్ మధ్యాహ్నం నుండి రాత్రి 8. 30 వరకూ ఉంటుంది. గమనించండి.

read more " విజయవాడ బుక్ ఫెస్టివల్ - 2025 లో పంచవటి స్టాల్ మొదలైంది "