జనవరి 2 నుండి విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో పదిరోజులపాటు జరిగే 'విజయవాడ పుస్తక మహోత్సవం' రెండురోజులలో మొదలు కాబోతున్నది.
దీనిలో పంచవటికి 186 స్టాల్ నంబర్ కేటాయించబడింది. యధావిధిగా మా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
హైద్రాబాద్ బుక్ ఫెయిర్ లో మా స్టాల్ వందలాదిమందికి జ్ణానదాహార్తిని తీర్చింది. మేము అనుకున్నదానికంటే ఎక్కువగా ప్రజాదరణను పొందింది. ఎంతోమంది సందర్శకులు మావాళ్లు చెప్పినది శ్రద్దగా విని, మా దారిని అర్ధం చేసుకోగలుగుతున్నారు.
సందేహసుందరాలు, విజ్ఞానప్రదర్శకులు, యూట్యూబ్ యూనివర్సిటీ పట్టభద్రులు, పాత అభిమానులు, అహంకారపూరిత వాదనాపరులు, ఈ విధంగా ఎన్నిరకాల మనుషులు మా స్టాల్ ను సందర్శించినప్పటికీ, నిజమైన జిజ్ఞాసువులు, ఆలోచనాపరులు, సాత్త్వికులు కూడా వారిలో చాలామంది ఉన్నారు. వారిదే అసలైన ప్రయోజనం.
హైద్రాబాద్ రంగస్థలాన్ని వదలి, ఇప్పుడు విజయవాడ ప్రాంతప్రజలకు అసలైన ఆధ్యాత్మికవెలుగులను చూపించడానికి 'పంచవటి' వస్తున్నది. మీకు జిజ్ఞాస ఉంటే, ఇక్కడకూడా మా సంస్థ ముఖ్యసభ్యులను మీరు కలుసుకోవచ్చు. మీమీ సందేహాలను తీర్చుకోవచ్చు.
ఈ లోపల మూడు క్రొత్తపుస్తకాలు ప్రింట్ చేయబడుతున్నాయి. విజయవాడ స్టాల్లో లభిస్తాయి. అవి,
1. శ్రీ గోరక్ష వచనసంగ్రహము
2. ధ్యానబిందూపనిషత్తు
3. నాదబిందూపనిషత్తు.
నా రచనలను, భావజాలమును, సాధనామార్గమును అభిమానించే జిజ్ఞాసువులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం.



